ENGLISH

క్రేజీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్

25 October 2024-10:02 AM

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఎప్పుడో వచ్చిన సినిమాలకి కూడా నేడు సీక్వెల్స్ రూపొందుతున్నాయి. ఇప్పటికే ఒక సినిమా ప్రేక్షకుడిని మెప్పించి, చిరస్థాయిగా ఉన్నప్పుడు అదే కథకి కొనసాగింపు ఇస్తే ఈజీగా ఆడియన్స్ లోకి వెళ్తుంది. మళ్ళీ ఒక కొత్త కథని నమ్ముకుని, భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేయటం ఎందుకని పాత కథనే నమ్ముకుని, అదే హీరోలతో సీక్వెల్స్  ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగానే    25 ఏళ్ళ తరువాత భారతీయుడు 2 వచ్చింది. ఇంకా త్రీ కూడా రాబోతోంది. ఇప్పడు మళ్ళీ అలాంటి అద్భుతమైన సీక్వెల్ ఒకటి తెరపైకి వచ్చింది. 


2005 లో కోలీవుడ్ లో మురుగుదాస్ తెరకెక్కించిన 'గజినీ' సినిమా అన్ని భాషల్లోనూ విశిష్ట ఆదరణ పొందింది. సూర్య, ఆసిన్, నయన తార నటించిన ఈ మూవీ తెలుగు తమిళం లో ఒకే సారి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. గజినీ సినిమా నుంచే సూర్యకి తెలుగులో గుర్తింపు వచ్చింది. ఇదే సినిమాని తరువాత అమీర్ ఖాన్, ఆసిన్ జంటగా హిందీలోనూ ఇదే పేరుతొ తెరకెక్కించారు మురుగుదాస్. అక్కడ కూడా భారీ సక్సెస్ అందుకుంది. హిందీలో100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమా 'గజినీ' కావటం విశేషం. ఈ మూవీని తెలుగులో అల్లు అరవింద్‌ రిలీజ్ చేసారు. ఈ మధ్య క్రేజీ ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తున్న గీతా ఆర్ట్స్ ఇప్పుడు గజినీ 2 పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.    
 

సీక్వెల్స్ కి ఉన్న క్రేజ్ ని గమనించిన అల్లు అరవింద్ 2005 వచ్చిన గజినీకి 20 ఏళ్ళ తరువాత   పార్ట్ 2 తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసినట్లు టాక్. ఈ మధ్య సూర్య కంగువా ప్రమోషన్స్ లో గజిని-2 ఐడియా అల్లు అరవింద్ గారికి ఉందని, ఇప్పటికే చర్చలు మొదలైనట్లు తెలిపారు. హిందీ వెర్షన్ లో నటించిన గజినీ అమీర్ ఖాన్ ఇది వరకే ఈ సీక్వెల్ ఎవరూ తీసినా నటిస్తానని ప్రకటించారు. సూర్య కూడా తనను అమీర్ ఖాన్ ను గజినీ 2 లో చూడొచ్చని చెప్పటంతో ఫాన్స్  ఈ సీక్వెల్ కోసం ఈగర్లీ వెయిటింగ్. అల్లు అరవింద్  తమిళ్, తెలుగులో సూర్యతో, హిందీ లో అమీర్ తో ఈ ప్రాజెక్ట్ ఒకేసారి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్.