ENGLISH

జానీ మాస్టర్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

16 September 2024-12:20 PM

జానీ మాస్టర్ స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదుగుతున్నారు. అన్ని ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు  తెచ్చుకుని పానిండియా స్థాయిలో సక్సెస్ ఫుల్ గా జర్నీ చేస్తున్నారు. ఈ మధ్య తమిళ మూవీ తిరుకి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా వరుస ఛాన్స్ లు అందుకుంటూ నంబర్ వన్ గా దూసుకుపోతున్న జానీ లైఫ్ లో ఒక కుదుపు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ, జనసేనలో చేరారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కొందరికి టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఆరోపణలు వచ్చి ఉంటాయని అంతా భావిస్తున్నారు.  


రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఒక లేడి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైగికంగా వేదించినట్లు కంప్లైన్ట్ చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు FIR నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని, ముంబైకి చెందినదిగా సమాచారం.  చెన్నై, ముంబై, హైదరాబాద్‌ లలో అవుట్‌ డోర్ షూటింగ్స్ లోను, నార్సింగిలో తన ఇంట్లో కూడా జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలో తన ఇంటికి వచ్చి కూడా చాలా సార్లు అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె కంప్లైన్ట్ లో తెలిపింది. ఈ కేసుని ముంబైకి ట్రాన్స్ ఫర్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


ఆమె కంప్లైన్ట్ ని స్వీకరించిన రాయదుర్గం పోలీసులు జానీ పై FIR నమోదు చేసి, కేసు నార్సింగి పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు. కారణం కంప్లైంట్ చేసిన వ్యక్తి, నార్సింగ్ లో పరిధిలో  ఉండటమే.  నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2) కింద కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు. ఈ విషయాలపై జానీ మాస్టర్ స్పందించాల్సి ఉంది. ఇదంతా నిజమే అయితే ఆమె ఇన్నాళ్లు ఎందుకు కంప్లైన్ట్ చేయలేదు. ఇపుడే ఎందుకు బయటికి వచ్చింది అన్న ఆరాలు తీస్తున్నారు జానీ ఫాన్స్. కావాలనే ఎవరో జానీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వారు కొట్టి పడేస్తున్నారు.