ENGLISH

SSMB29 దసరాకి షురూ

16 September 2024-13:12 PM

మహేష్‌ - రాజమౌళి కాంబో మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. కారణం RRR సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న జక్కన్న నెక్స్ట్ మూవీ ఇదే కావటం. ఇంత లాంగ్ గ్యాప్ లో జక్కన్న పక్కా ప్లాన్ తో మ్యాజిక్ చేయనున్నారని,  పైగా మహేష్ లాంటి స్టార్ ని ఈ మూవీకి ఎంచుకోవటంతో హాలీవుడ్ స్థాయి గుర్తింపు దొరికింది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మహేష్ కథలో పాత్రకి  తగ్గ మేకోవర్ తో ఆకట్టుకుంటున్నారు. మూవీ అనౌన్స్ చేసి ఇన్ని రోజులైనా  ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో ఫాన్స్ కొంచెం అసహనంగా ఉన్నారు. 


గుంటూరు కారం మూవీ తరవాత మహేష్ ఇంకో ప్రాజెక్ట్ కి ఒప్పుకోకుండా జక్కన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. మహేష్‌ బాబు బర్త్డే కానుకగా ఆగస్ట్‌ 9న అప్డేట్ వస్తుంది అనుకుంటే ఆ రోజు ఎలాంటి సమాచారం లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డైరెక్టర్ జక్కన్న 51 వ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 10న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తుందని టాక్. ఈ మూవీకోసం జక్కన్న ఒక వర్క్ షాప్ మొదలు పెట్టనున్నారట. దసరాకి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టి, ఈ సినిమాలో  నటించే నటీ నటుల్ని ఫైనల్ చేసి, వర్క్ షాప్ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనుల వలన ఇంత లేట్ అయ్యిందని సమాచారం. 


దసరాకి లాంఛనంగా సినిమా ప్రారంభించినా, మిగతా విషయాలన్నీ ప్రోపర్ గా ఫైనల్ చేసుకుని 2025 జనవరిలో సెట్స్‌ మీదకు వెళ్లనున్నారని టాక్. మన దేశ నటులతో పాటు కొందరు హాలీవుడ్‌ స్టార్స్ కూడా ఈ మూవీలో నటిస్తారని సమాచారం. వెయ్యి కొట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత కె.ఎల్‌. నారాయణ ఈసినిమాని తెరకెక్కిస్తున్నారు.