ENGLISH

డేటింగ్స్ పై క్లారిటీ ఇచ్చిన రెజీనా

14 September 2024-15:12 PM

రెజీనా కసాండ్రా తెలుగు సినిమాలో కనిపించి చాలా ఏళ్ళు అయ్యింది. SMS మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తరవాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, శౌర్యం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలతో మెప్పించింది. రాను రాను రెజీనాకి    తెలుగులో అవకాశాలు లేకపోవటంతో కనుమరుగైపోయింది. హిందీ, తెలుగు , తమిళం వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఆడియన్స్ ని మెప్పించింది. తెలుగులో చివరిగా 'శాకినీ డాకిని' మూవీలో కనిపించింది. అందం అభినయం ఉండి, హద్దులు లేని గ్లామర్ ఒలికించినా రేజీనాకి టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాలేదు. చాలా రోజుల తరవాత తన సినిమా 'ఉత్సవం' రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రెజీనా మీడియాతో చాలా విషయాలు షేర్ చేసుకుంది. వీటిలో తన ఎఫైర్స్‌ గురించి కూడా ఓపెన్ గా చెప్పింది. 


గతంలో రేజీనాకి సందీప్‌ కిషన్ , సాయి తేజ్‌ లతో అఫైర్లని, పెళ్లి అంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాటిన్నటికి చెక్ పెడుతూ సందీప్, సాయి తేజ్ తనకి కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని, అయినా వారితో తన బాండింగ్ స్పెషల్ గా ఉంటుందని పేర్కొంది. 'సందీప్, నేను టామ్ అండ్ జెర్రీ లా ఫైట్ చేసుకుంటామని, ఒకరిపై ఒకరం అరుచుకుంటామని, కోపంతో నెలల తరబడి మాట్లాడుకోవటం మానేస్తామని తర్వాత అసలేం జరగనట్టే మళ్లీ మాట్లాడుకుంటామని తెలిపింది. సాయి ధర్మ తేజ్ ఎప్పుడూ పీస్ ఫుల్ గా ఉంటాడు. స్వీట్‌ పర్సన్‌. సాయితో నా బంధం చాలా స్పెషల్,  సందీప్‌తో గొడవపడినట్లు సాయితో గొడవలు పడను, అసలు మేమిద్దరం ఎప్పుడూ గొడవపడిన సందర్భమే లేదు అని చెప్తూ ఎప్పటికప్పుడు మాకు మీడియాలో  పెళ్లి చేసేస్తూనే ఉన్నారని ఆరోపించింది. మొత్తానికి సాయి తేజ్ సందీప్ కేవలం ఫ్రెండ్స్ అని పుకార్లలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది.  


కానీ చాలామందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని తాను సీరియల్ డేటర్ అంటూ చెప్పి ఫాన్స్ కి షాకిచ్చింది. ఇప్పుడయితే సింగిల్ గా ఉన్నానని, కేవలం బాయ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని స్పష్టం చేసింది. అంతే కాదు తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. బాధ్యతలు తెలిసినవాడు, తన గూర్చి కేర్ తీసుకునే వాడు అయితే చాలని అంతకుమించి తనకి కోరికలు లేవని చెప్పింది.