ENGLISH

మహేష్, ప్రభాస్ లతో కరీనా?

18 September 2024-14:13 PM

కపూర్ల కుటుంభం నుంచి హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి  తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది కరీనా. తనకంటే ముందే ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన అక్క కరిష్మా కపూర్ ని మించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లో కరీనా సినీప్రయాణానికి 25 ఏళ్ళు నిండాయి. ఎంత క్రేజీ ఉన్నా, ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇప్పటివరకు బాలీవుడ్ తప్ప వేరే ఇండస్ట్రీ వైపు చూడలేదు. కరీనా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్స్ వచ్చినా నిరాకరించింది. ప్రజంట్ సౌత్ నార్త్ లెక్కలు మారటంతో పాన్ ఇండియా ప్రాజెక్టులు తెరకెక్కుతుండటంతో ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉంది. 


ఈ క్రమంలోనే సౌత్ లో ఇప్పుడిప్పుడే ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ లో కరీనా మెయిన్ లీడ్ చేస్తుండగా ఇప్పడు టాలీవుడ్ లో కూడా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో కరీనా పేరు వినిపిస్తోంది. మహేష్ - జక్కన్న కాంబో మూవీలో కరీనా హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం ఊపందుకుంది. అయితే ఒక ఫారెన్ హీరోయిన్ ని మహేష్ కోసం జక్కన్న సెలెక్ట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బహుశా కరీనా కూడా ఒక మెయిన్ లీడ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అని సమాచారం. దసరాకి SSMB29 పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్న నేపథ్యంలో దీనిపై అఫీషియల్ గా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 


డార్లింగ్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా సాబ్ షూటింగ్ జరుగుతోంది. నెక్స్ట్ హను రాఘవపూడి సినిమా ఫౌజీ రీసెంట్ గా పూజా కార్యాక్రమాలు జరుపుకుంది. ఈమూవీతో ఇమ్మాన్వి అనే అమ్మాయి పరిచయం కానుంది. తరవాత సందీప్ వంగా , ప్రభాస్ కాంబో మూవీ స్పిరిట్ కి హీరోయిన్ ని వెతుకుతున్నట్లు సమాచారం. ఇందులో ఇప్పుడు కరీనా  పేరు వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి క‌రీనా సైన్ చేసింద‌నే ప్ర‌చారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఆది పురుష్ లో మొదట సీతగా కరీనా నటించాల్సి ఉండగా మిస్ అయ్యింది. అప్పుడు  మిస్ అయిన ఈ జోడి ఇప్పుడు స్పిరిట్ తో అలరించనున్నారేమో చూడాలి.