ENGLISH

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ట్రిపుల్‌ ధమాకా

17 July 2017-15:58 PM


తెలుగులో 'స్పైడర్‌' సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది కాక తమిళంలో 'తీరన్‌ అదిగారం ఒండ్రు' సినిమా చేస్తోంది రకుల్‌. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తయ్యింది. ఇంతేనా, ఇంకా కథ చాలానే వుంది. మళ్ళీ బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అక్కడ 'అయారీ' అనే సినిమాలో నటిస్తోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కొంతకాలం క్రితం హిందీలో రకుల్‌ 'యారియాన్‌' అనే సినిమాలో నటించింది. అక్కడి నుండే సౌత్‌లోకి అడుగు పెట్టింది. అయితే సౌత్‌లో, ముఖ్యంగా తెలుగులో బిజీ అవడంతో బాలీవుడ్‌కి గ్యాప్‌ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడెందుకో బాలీవుడ్‌ సినిమాల్లో నటించాలనే ఆలోచనతో, వరుసగా వస్తున్న ఆఫర్స్‌ని ఓకే చేస్తోంది. 'అయారీ' సినిమా 2018 జనవరి 26న విడుదల కాబోతోంది. నీరజ్‌ పాండే దర్శకత్వం ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. గతంలో 'ఎ వెడ్‌నెస్‌డే', 'బేబీ', 'ఎం.ఎస్‌. ధోనీ ది అన్‌టోల్డ్‌ స్టోరీ' వంటి సక్సెస్‌ ఫుల్‌ సినిమాల్ని నీరజ్‌ పాండే తెరకెక్కించారు. 'అయారీ' సినిమాలో రకుల్‌కి నటన పరంగా చాలా స్కోప్‌ ఉన్న పాత్ర దక్కిందట. లండన్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది. బాలీవుడ్‌లో ఇప్పటికే టాలీవుడ్‌ భామ తాప్సీ ప్రాధాన్యత ఉన్న పాత్రలతో దూసుకెళ్లిపోతోంది. అలాగే రకుల్‌ కూడా అక్కడ బిజీ అయిపోతుందేమో చూడాలిక.

 

ALSO READ: వదంతుల పై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్