ENGLISH

ఇప్పట్లో మెగా రీమిక్స్‌ల్లేవట

03 March 2017-13:18 PM

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ తొలి సినిమా 'రేయ్‌' నుండీ తన మామయ్య చిరంజీవి సినిమాల్లోని పాటలను రీ మిక్స్‌ చేస్తూ వస్తున్నాడు. ఈ రీమిక్స్‌లు చాలా పాపులర్‌ అయ్యాయి. తాజాగా 'విన్నర్‌' సినిమాతో మన ముందుకు వచ్చాడు సాయి ధరమ్‌ తేజ్‌. 'విన్నర్‌' సినిమాతో రేస్‌లో విన్‌ అయ్యాడు. సినిమా సక్సెస్‌ అయ్యింది. ఆ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌. ఈ ఆనందంతోనే బుల్లితెరపై మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా వస్తోన్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంకి కంటెస్టెంట్‌గా వచ్చాడు. మామా అల్లుళ్ల అప్పియరెన్స్‌తో ఫుల్‌ జోష్‌గా సాగుతోంది ఈ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో తేజు గెలుచుకున్న అమౌంట్‌ని 'థింక్‌ పీస్‌', రామకృష్ణ మిషన్‌' సంస్థలకి డొనేషన్‌గా ఇస్తానని తేజు చెప్పడం విశేషం. అలాగే ఈ గేమ్‌ షో గ్యాప్‌లో చిరంజీవి, యంగ్‌ హీరోగా సాయి ధరమ్‌ తేజు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా ఇకపై రాబోయే సినిమాలకు ఏ సాంగ్స్‌ రీమిక్స్‌ చేయబోతున్నావు అని తేజుని అడిగారు చిరంజీవి. అయితే ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు కానీ రీ మిక్స్‌ చేయాల్సి వస్తే 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..' సాంగ్‌ని రీ మిక్స్‌ చేస్తానని తేజు చెప్పాడు. మొత్తానికి చిరంజీవి, తేజు కాంబినేషన్‌లో జరిగిన ఈ షో భలే ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఫ్యాన్స్‌ మామా, మేనల్లుళ్లను ఇద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. తేజు ప్రస్తుతం బివియస్‌. రవి దర్శకత్వంలో 'జవాన్‌' సినిమాలో నటించనున్నాడు.

ALSO READ: మెగా న్యూస్‌ ఎప్పుడొస్తుందో!