ENGLISH

ఫుల్‌ డోస్‌ గ్లామర్‌లో జిగేల్‌ రాణి.!

19 April 2019-18:15 PM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో 'జిగేల్‌ రాణీ' అంటూ ఊరించింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో 'రెడ్డీ..' అంటూ కవ్వించింది. ఇప్పుడు మహేష్‌తో 'ఎవరెస్ట్‌ అంచున పూసిన రోజా పువ్వా..' అంటూ పొగిడించుకుంటోంది. ఎవరి గురించో అర్ధమైపోయుంటుంది కదా. అవును పూజాహెగ్డే గురించే. వరస పెట్టి స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ పూజాహెగ్దే ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌తో రెండో సారి జతకట్టబోతోంది.

 

'అరవింద సమేత' తర్వాత రెండోసారి త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే, తాజాగా పూజాహెగ్డే నటించిన 'మహర్షి' సినిమా నుండి డ్యూయెట్‌ ప్రోమో బయటికి వచ్చింది. 'ఎవరెస్ట్‌ అంచున పూసిన రోజా పువ్వు చిరునవ్వే విసిరింది..' అంటూ సాగే ఈ పాటలో మహేష్‌బాబు, పూజాహెగ్డే జంట బ్రైట్‌గా ఆకట్టుకుంటోంది. మహేష్‌ పక్కన సరి జోడీగా పూజా హెగ్డే అందం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 

 

ఇంతవరకూ 'మహర్షి'పై ఉన్న అంచనాలు ఈ వీడియో ప్రోమోతో పదింతలైపోయాయి. మహేష్‌ - పూజాహెగ్డే కెమిస్ట్రీ చక్కగా కుదిరింది ఈ పాటలో. పూజాహెగ్డే తన ఘాటు అందాలను వేడి వేడిగా వడ్డించేసింది. పూజాహెగ్డే గ్లామరే ఈ సాంగ్‌ ప్రోమోకి హైలైట్‌గా నిలిచింది. మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న 'మహర్షి'ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, ప్రసాద్‌ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు. 

ALSO READ: సాయి ధరమ్‌ తేజ్‌ నెక్స్ట్ ఏంటీ.?