ENGLISH

పబ్లిక్‌లో విజయ్‌దేవరకొండ రాజకీయం.!

27 September 2018-17:01 PM

విజయ్‌ దేవరకొండ తన సినిమాల ప్రమోషన్స్‌ విషయంలో చాలా విభిన్నంగా ఆలోచిస్తుంటాడు. వాస్తవానికి ఆయన చేసే ప్రమోషనే ఆయన సినిమాలకు ప్రాణం. ప్రమోషన్స్‌తో సంచలనం సృష్టించి, సినిమాపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తుంటాడు. తాజాగా విజయ్‌ దేవరకొండ నటిస్తున్న 'నోటా'చిత్రం ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. అందులో భాగంగానే విజయ్‌ దేవరకొండ సరికొత్త ప్రమోషన్‌కి తెర లేపాడు.

అదే 'ది నోటా పబ్లిక్‌ మీటింగ్‌'. అంటే పబ్లిక్‌తో డైరెక్ట్‌గా విజయ్‌ దేవరకొండ మమేకమవుతాడన్న మాట. ఈ మీటింగ్స్‌ని ఆంధ్రాలో ఒకటి, తెలంగాణాలో ఒకటి ప్లాన్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో సెప్టెంబర్‌ 1న నోటా పబ్లిక్‌ మీటింగ్‌ జరగనుంది. అలాగే తెలంగాణాలో అక్టోబర్‌ 1న నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌లో చిత్ర యూనిట్‌తో పాటు, సినిమాలోని కీలకపాత్రధారులంతా పాల్గొననున్నారట. ఈ రకంగా తెలుగు రాష్ట్రాల్లో 'నోటా' ప్రమోషన్స్‌కి విజయ్‌ దేవరకొండ స్పెషల్‌గా ప్లాన్‌ చేశాడు.

ఇక ఓవర్సీస్‌లో సందడికీ తన ప్లాన్‌ తనకుందంటున్నాడు విజయ్‌ దేవరకొండ. అక్కడ అక్టోబర్‌ 4 నుండే ప్రీమియర్స్‌ పడనున్నాయి. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది 'నోటా'. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'నోటా'కు జ్ఞాన్‌వేల్‌ రాజా నిర్మాత. మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ALSO READ: దేవ‌దాస్‌ మూవీ రివ్యూ & రేటింగ్