ENGLISH

#SSMB28: మహేష్‌ - త్రివిక్రమ్‌.. గాలి తీసేసిన నిర్మాత

04 October 2022-12:04 PM

మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ సినిమా ఇటివలే రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైయింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న మూడో సినిమా. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. కాగ ఈ సినిమాఆపి అప్పుడే భారీ బిజినెస్ లెక్కలు మొదలయ్యాయి. ఈ మూవీ కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని , బిజినెస్ దాదాపే రూ. 300 కోట్ల మేర జరుగుతోందని ఆడియో హక్కులకే భారీ స్థాయిలో రూ. 30 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఓటీటీ శాటిలైట్ థియేట్రికల్ రైట్స్ పరంగానూ భారీ పోటీ నెలకొందంటూ రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.

 

అయితే మహేష్-త్రివిక్రమ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కట్లేదని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఇది తెలుగు సినిమానే, కేవలం తెలుగు సినిమానే అయినప్పుడు రూ.300 కోట్ల బిజినెస్ ఎలా జరుగుతుందని తిరిగి ప్రశ్నించారు. ఈ సినిమాకు అసలు తాము బిజినెస్సే మొదలుపెట్టలేదని, ప్రొడక్షన్ కొంత అయ్యాక కానీ బిజినెస్ మొదలుపెట్టమని., ఈ సినిమాకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అన్నది కూడా తమకు ఇంకా క్లారిటీ లేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ సినిమా చుట్టూ వున్న గాలి వార్తల గాలి తీసేశారు నాగ వంశీ.

ALSO READ: ‘సలార్‌’ టీమ్ పై ప్రశాంత్‌ నీల్‌ ఫైర్