ENGLISH

Mahesh Babu: మ‌హేష్‌కి క‌థ చెప్పిన 'గాడ్ ఫాద‌ర్‌' ద‌ర్శ‌కుడు

04 October 2022-11:02 AM

హ‌నుమాన్ జంక్ష‌న్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న‌ని తాను ప్రూవ్ చేసుకొన్నాడు మోహ‌న్ రాజా. రామ్ చ‌ర‌ణ్ ధృవ‌తో హిట్ కొడితే.. ఆ ధృవ ఒరిజిన‌ల్ వెర్ష‌న్ త‌ను ఒరువ‌న్‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.. మోహ‌న్ రాజానే. ధృవ చిత్రానికి మోహ‌న్ రాజానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలి. కానీ కుద‌ర్లేదు. ఇప్పుడు చిరంజీవితో `గాడ్ ఫాద‌ర్‌` తెర‌కెక్కించి ఆ లోటు తీర్చుకొన్నాడు. 'గాడ్ ఫాద‌ర్‌' కూడా మ‌ల‌యాళ చిత్రం 'లూసీఫ‌ర్‌'కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా బుధ‌వారం విడుద‌ల అవుతోంది. త్వ‌ర‌లోనే నాగార్జున‌తో సినిమా చేయ‌బోతున్నాడు మోహ‌న్ రాజా. అయితే ఈమ‌ధ్య‌లో మ‌హేష్ బాబుకి కూడా ఓ క‌థ చెప్పాడ‌ట. ఈ విష‌యాన్ని మోహ‌న్ రాజానే చెప్పాడు.

 

''మ‌హేష్ బాబు కోసం ఓ క‌థ సిద్ధం చేశాను. అది ఆయ‌న‌కు వినిపించాను కూడా. నిర్మాత‌ ఎన్వీ ప్ర‌సాద్ గారే న‌న్ను మహేష్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లారు. ఆ స‌మ‌యంలోనే `లూసీఫ‌ర్`ని తెలుగులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. నా పేరు ప్ర‌సాద్ గారే చిరంజీవిగారికి చెప్పారు. నేనైతే ఈ క‌థ‌కు న్యాయం చేయ‌గ‌ల‌న‌ని చిరంజీవిగారు కూడా న‌మ్మారు. అలా ఈ ప్రాజెక్టులోకి వ‌చ్చా'' అని గాడ్ ఫాద‌ర్ సంగ‌తులు చెప్పుకొచ్చారు మోహ‌న్ రాజా. అయితే మ‌హేష్ సినిమా సంగ‌తి ఏమైంది? అని అడిగితే దాటేశారు. గాడ్ ఫాద‌ర్ గ‌నుక సూప‌ర్ హిట్ట‌యి, నాగార్జుతో తెర‌కెక్కించే వందో సినిమా కూడా బాగా ఆడేస్తే.. అప్పుడు మ‌హేష్ నుంచి పిలుపొస్తుందేమో...?

ALSO READ: ‘సలార్‌’ టీమ్ పై ప్రశాంత్‌ నీల్‌ ఫైర్