పూరి జగన్నాథ్ కలల ప్రాజెక్టు `జగగనమణ`. ఈ సినిమాని మహేష్ బాబుతో తీద్దామని ఎప్పుడో డిసైడ్ అయ్యాడు. ఇద్దరూ కలిసి ఈ సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ ఏమైందో.. ఈ సినిమా సడన్ గా ఆగిపోయింది. ఆ తరవాత...ఆ కథ జోలికి వెళ్లలేదు పూరి. త్వరలో యష్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు పూరి. అది మహేష్ కోసం రాసిన జనగనమణ కథే అని వార్తలొచ్చాయి. అయితే.. ఈ కథ యష్తో చేయడం లేదు.
యష్ కోసం వేరే కథ సెట్ చేసిన పూరి.. జనగనమణ కోసం పవన్ కల్యాణ్ ని రంగంలోకి దించడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు. పవన్ - పూరిల మధ్య మంచి బాండింగ్ వుంది. బద్రితో వీళ్ల ప్రయాణం మొదలైంది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫ్లాప్ అయినా... అందులో పవన్ని అభిమానులకు నచ్చేలా చూపించాడు. ఇప్పుడు మరోసారి పవన్తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట. జనగనమణని పవన్ శైలికి తగినట్టు మార్చి.. తనకు త్వరలోనే వినిపించబోతున్నాడని, పవన్ ఓకే అంటే 2022లో ఈ సినిమాని పట్టాలెక్కిస్తాడని సమాచారం. పవన్ గనుక ఓకే అంటే.. బాక్సాఫీసు బద్దలైపోయే సినిమా మొదలైపోయినట్టే.
ALSO READ: పవన్ రెండు పడవల ప్రయాణం.. ఎందాకా.?