ENGLISH

సందీప్‌ కిషన్‌తో మిల్కీ సినిమా షురూ

29 May 2017-11:31 AM

'బాహుబలి' సినిమాతో అవంతికా రాకుమారిగా ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ కొత్త సినిమా షురూ చేసింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ కునాల్‌ కోహ్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే లండన్‌లో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ కునాల్‌ కోహ్లీకి తెలుగులో ఇదే తొలి చిత్రం కానుంది. గతంలో అమీర్‌ ఖాన్‌, కాజోల్‌తో 'ఫనా' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టరే ఈ కునాల్‌. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం అందుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయనున్నారు. సందీప్‌ కిషన్‌ ఇప్పటికే 'నక్షత్రం' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కృష్ణ వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలోనూ ఓ చిత్రంలో నటిస్తున్నాడు సందీప్‌. ఈ సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నాడన్న మాట. మరో పక్క ఈ సినిమా హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. తమన్నా ప్రధాన పాత్రలో విడుదలైన 'అభినేత్రి' సినిమా హిందీలోనూ, తమిళంలోనూ కూడా మంచి సక్సెస్‌ అందుకుంది. అదే తరహాలో ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందని భావిస్తున్నారు. తాజాగా కునాల్‌తో తమన్నా దిగిన ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి సినిమా సంగతి రివీల్‌ చేసింది మిల్కీ బ్యూటీ. ఈ ఫోటోలో తమన్నా డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తోంది.

ALSO READ: ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- రారండోయ్ వేడుక చూద్దాం