ENGLISH

'మీ టూ'పై మిల్కీ బ్యూటీ స్వీట్‌ కామెంట్‌!

19 October 2019-15:11 PM

ఈ మధ్య తెలుగు, తమిళ, హిందీ అనే భాషా బేధం లేకుండా 'మీ టూ' ఉద్యమం సినీ ఇండస్ట్రీని కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. చాలా మంది ముద్దుగుమ్మలు ఈ విషయంలో తమ తమ అనుభవాల్ని, అభిప్రాయాల్ని పంచుకున్నారు. బాధితులైన కొందరు తమ అనుభవాలను పంచుకుంటే, అదృష్టవశాత్తూ అలాంటి వేధింపులు ఎదుర్కోలేదని ఇంకొందరు చెప్పుకొచ్చారు.

 

మొత్తానికి మీ టూ బాధితులకు అందరూ అండగా నిలిచారు. ఉద్యమం ఉధృతం కావడంతో, బాధితులందరూ ధైర్యంగా ముందుకొచ్చి తమ బాధను షేర్‌ చేసుకున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ ముందు 'మీ టూ'కి సంబంధించిన క్వశ్చన్‌ రైజ్‌ అయ్యింది. ఈ విషయంలో తమన్నా చాలా హుందాగా వ్యవహరించింది. 'మీ టూ' కారణంగా చాలా మంది సినిమాల్లో అవకాశాలు కోల్పోవడం చూశాం. ఇది నిజంగా బాధాకరం. కానీ, అదృష్టవశాత్తూ నేను దాన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేయలేదు.

 

బాధితులెవరైనా సరే, ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని తమన్నా కోరింది. లేటెస్ట్‌గా తమన్నా 'సైరా నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'సైరా'తో తెచ్చుకున్న క్రేజ్‌తో తమన్నాకి వరుస అవకాశాలు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే తమన్నా నటించిన రెండు మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరిన్ని కొత్త ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

ALSO READ: అఖిల్‌ ప్రయోగం ఈ సారైనా ఫలిస్తుందా?