ENGLISH

నాగ‌బాబుకి త‌గ్గ‌ని క్రేజ్‌... భారీ పారితోషికం

04 December 2021-10:12 AM

న‌టుడిగా ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలీదు గానీ, జ‌బ‌ర్‌ద‌స్త్ తో మాత్రం మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు నాగ‌బాబు. ఆర్థికంగా చితికి పోయిన ద‌శ‌లో... నాగ‌బాబుని జ‌బ‌ర్‌ద‌స్త్ ఆదుకుంది. ఆ షోతో... త‌ను ఆర్థికంగా నిల‌బ‌డ్డాడు. అయితే... ఈమ‌ధ్యే ఆయ‌న జ‌బ‌ర్‌ద‌స్త్ టీమ్ కి గుడ్ బై చెప్పారు. జీ టీవీలో ఓకామెడీ షో మొద‌లెట్టారు. కానీ... అది కొన్నాళ్లే న‌డిచింది. రేటింగులు లేక‌.. ఆ షో ఆగిపోయింది.

 

జ‌డ్జి గా నాగ‌బాబు కెరీర్‌కీ పుల్ స్టాప్ ప‌డింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న జ‌డ్జ్ అవ‌తారం ఎత్తారు. మా టీవీలో ప్ర‌సార‌మ‌య్యే కామెడీ స్టార్స్ కి నాగ‌బాబు జ‌డ్జిగా రాబోతున్నాడు. ఇక‌... మ‌ళ్లీ బుల్లి తెర‌పై నాగ‌బాబుని చూడొచ్చు. ఈ షో కోసం నాగ‌బాబుకి మంచి పారితోషిక‌మే ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌బ‌ర్‌ద‌స్త్ కి ఇచ్చిన పారితోషికంతో పోలిస్తే.. మా టీవీ వాళ్లు డ‌బుల్ రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. అంటే.. బుల్లి తెర‌పై నాగ‌బాబు క్రేజ్ ఇంకా త‌గ్గ‌లేద‌న్న‌మాట‌. జ‌బ‌ర్ ద‌స్త్ లోనూ నాగ‌బాబు రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి. అయితే.. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని టాక్. నాగ‌బాబు ఇప్పుడు `మా టీవీ`కే ప‌రిమితం అయ్యార‌ని స‌మాచారం.

ALSO READ: టాలీవుడ్ కి గుడ్ న్యూస్‌