ENGLISH

మరో ఓటీటీకి రెడీ అవుతున్న శివాని రాజశేఖర్

05 December 2021-17:48 PM

ఇటివలే అద్భుతంతో ఓ విజయాన్ని అందుకుంది శివాని రాజశేఖర్. ఆమె మొదటి సినిమాగా వచ్చిన అద్భుతానికి మంచి ఆదరణ లభించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరక్కిన ఈ సినిమాకి మంచి ప్రసంశలు దక్కాయి. ఇప్పుడు మే నుండి మరో ఓటీటీ సినిమా రానుంది. అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా కె.వి.గుహన్‌ తెరకెక్కించిన చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’. రవిప్రసాద్‌ రాజు దాట్ల నిర్మాత.

 

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనిలివ్‌’లో విడుదల కానుంది. ‘తొలిసారి తెలుగులో వస్తున్న కంప్యూటర్‌ స్క్రీన్‌ బేస్డ్‌ మూవీ ఇది. ఓటీటీకి సరిగ్గా సరిపోతుంది. గుహన్‌ మేకింగ్‌, అదిత్‌ అరుణ్‌ - శివానిల కెమిస్ట్రీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సైమన్‌ కె.కింగ్‌ మ్యూజిక్.

ALSO READ: పుష్ఫ‌కి బూస్ట‌ప్ ఇచ్చిన అఖండ‌