ENGLISH

డబుల్ ఇస్మార్ట్ కి డబుల్ డీల్స్

27 July 2024-19:53 PM

రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ని కొత్తగా చూపించి ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు పూరి. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు కూడా డబుల్ ఇస్మార్ట్ పై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీ పైనే  రామ్, మణిశర్మ, పూరి ఆశలున్నాయి.   ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కి మంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. 


ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ మొదలు పెట్టింది టీమ్. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో డబుల్ ఇస్మార్ట్ మార్కెట్ పై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఈ   మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లు ఒక రేంజ్ లో జరిగినట్లు టాక్. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి 60 కోట్ల రూపాయలకి తీసుకున్నారని సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ కూడా పూర్తయింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో 30 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. 


థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 90 కోట్లుతో రామ్‌ కెరీర్‌ లోనే ఇదే అత్యంత ఎక్కువ మొత్తం అని, పెద్ద డీల్ కి అమ్ముడైనట్లు మేకర్స్ తెలిపారు. ఆడియో రైట్స్ 9 కోట్లకు సేల్ అవగా, హిందీ వెర్షన్ ఓటీటీ డీల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా శాటిలైట్ హక్కులు కూడా సేల్ చేయలేదు. వాటి డీల్స్ కూడా పూర్తయితే మంచి లాభాలు వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.